క్రైమ్/లీగల్

చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటన కడప నగర శివారులో సోమవారం జరిగింది. గౌస్, ఖాజీపీర్, వౌలా నీట మునిగి మృత్యువాతపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారు రామాంజనేయపురం సాగర్ కాలనీకి చెందిన గౌస్, ఖాజాపీర్, వౌలా కలిసి సమీపంలోని బుడ్డాయపల్లె చెరువులో ఈతకు వెళ్లారు. నీళ్లలోకి దిగిన వీరు ఈతరాక మునిగిపోయారు. అయితే పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని చెరువులు, కుంటల వెతికారు. బుడ్డాయపల్లె చెరువులో ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించడంతో భోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.