క్రైమ్/లీగల్

ఎమ్మార్పీఎస్ నేత పాండు హత్య ఇసుక మాఫియా పనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, ఫిబ్రవరి 3: గ్రామస్థులు, ఇతరులు ఊహించనట్లుగానే లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు హత్య ఇసుక మాఫియా పనేనని తేలింది. సోమవారం డీసీసీ నారాయణరెడ్డి నేరస్తులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను తెలియజేశారు. హత్య జరగక ముందు రెండు రోజుల నుండి అక్రమ ఇసుక రవాణాదారులతో పాండుకు వాగ్వాదం ఏర్పడగా గ్రామానికి చెందిన అక్రమ ఇసుక రవాణాదారులే హత్యకు పాల్పడడం జరిగిందని తెలిపారు. నేరస్తులైన బొడిగె రవీందర్, నీళ్ల నరేశ్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మండలంలో గోకారం, వేములకొండ, దుప్పల్లి వంటి గ్రామాల్లో కూడా ఇసుక మాఫియా మూసీ నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల ఆర్థిక లబ్థికోసం అక్రమ ఇసుకాసురులకు సహకరిస్తున్నారని మూసీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న గ్రామాల్లో వినిపిస్తుండగా దీనిపై అధికారులు ఏటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.