క్రైమ్/లీగల్

బస్సుకింద పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 8: బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడుమోలు వద్ద శనివారం చోటు చేసుకుంది. మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన మురారి రామచంద్రరావు(50) నిడుమోలులో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా బస్సు కదలటంతో కింద పడ్డాడు. అతనిపై నుండి బస్సు వెనక చక్రాలు వెళ్లడంతో కుడికాలు పూర్తిగా నుజ్జు కాగా ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ఆర్టీసీ డ్రైవర్ బాధితుడిని మచిలీపట్నం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు మురారి వెంకట నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హబీబ్ భాషా తెలిపారు.