క్రైమ్/లీగల్

ఎంపీ కేకే ఓటుపై బీజేపీ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎక్స్ అఫీషియో ఓటుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తుక్కుగూడ మున్సిపాల్టీలో కేకే ఓటు వేయడంపై బీజేపీ కౌన్సిలర్లు పిటిషన్ దాఖలు చేశారు. కేశవరావు ఓటు చెల్లుబాటు కాదని ప్రకటించాలని వారు పిటిషన్‌లో కోరారు. కేకే ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ఎంపీల జాబితాను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు పార్లమెంటు సెక్రటరీ జనరల్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కేశవరావు పేరును ఆంధ్రప్రదేశ్ కోటాలో సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై మరోపక్క బీజేపీ రాష్ట్ర కమిటీ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేసింది.