క్రైమ్/లీగల్
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 February 2020
ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: విద్యుద్ షాక్తో విద్యార్థి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ష్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లో నివాసం ఉండే యాదమ్మ ఇండ్లలో పనిచేసుకొని జీవనం సాగిస్తుంది. భర్త శేఖర్ మృతిచెందగా కుమారుడు అఖిల్తో కలిసి ఉంటుంది. 12 ఏళ్ల అఖిల్ రౌండ్ టేబుల్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునేందుకు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్సీసీ) సమీపానికి వెళ్లాడు. క్రికెట్ ఆడే క్రమంలో బంతి రేకులపై పడటంతో బంతిని తిసే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.