క్రైమ్/లీగల్

మైహోంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాయదుర్గం బయోడైవర్సిటీ సమీపంలో మైహోం భూజా ప్రాజెక్టుకు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భూ కేటాయింపులు చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంతో పాటు మైహోం భూజా, డీఎల్‌ఎఫ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. మై హోంకు ఈ భూముల కేటాయింపు అక్రమంగా జరిగిందని రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 38 కోట్ల రూపాయిల స్టాండ్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని ఆ పిల్‌లో రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ 83లో 424.13 ఎకరాల భూమిని 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 161 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు కేటాయించిది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం ద్వారా ఈ భూమి ప్రభుత్వానికి సంక్రమించింది. ఏపీఐఐసీకి ఈ భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. ఈ భూమి ఐటీ జోన్ పరిధిలో ఉన్నందున దీనిని ఐటీ పార్కు, ఐటీ సంబంధిత ఇన్‌ఫ్రా నిర్మాణాల కోసమే వినియోగించాలని స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ద్వారా సుస్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ అనే బహుళజాతి సంస్థ భూ కేటాయింపుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను
షార్ట్ లిస్టు చేసి డీఎల్‌ఎఫ్ ట్రాక్ రికార్డు చూసి ఆ సంస్థకు ఏపీఐఐసీ నుండి భూ కేటాయింపులకు అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏపీఐఐసీ నుండి డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్ రాయదుర్గం డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 580 కోట్ల రూపాయిల విలువైన 31.35 ఎకరాల భూమి బదలాయింపు జరిగింది. సర్వే నెంబర్ 83/1లోని భూమిలోని ప్లాట్ నెంబర్ 6, 7, 11, 12లలో 25 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14/పీలోని 6.3 ఎకరాలు డీఎల్‌ఎఫ్‌కు కేటాయించారు. భూమిని కేటాయిస్తూ ఇచ్చిన లేఖలోని నిబంధన 16, 17 ప్రకారం ఏపీఐఐసీ ద్వారా సేల్ డీడ్ ఇష్యూ అయ్యేవరకూ ఈ భూమిని ఎవరికైనా బదలాయించడం నిషేధం. అలాగే లేఖ అందిన రోజు నుండి ఆరు నెలల్లోగా నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి, ఐదేళ్లలో పూర్తి చేయాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే భూ కేటాయింపులను రద్దు చేయవచ్చు. దాని ప్రకారం 2013 సెప్టెంబర్ 6న రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయిన తర్వాత విచిత్రంగా డీఎల్‌ఎఫ్ రాయదుర్గం డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ నుండి సంబంధిత అధికారులకు దరఖాస్తు అందింది. తమ కంపెనీ పేరును ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చుకోవడానికి అనుమతించాలని కోరింది. దానికి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ నుండి సంబంధిత అధికారులకు మరో దరఖాస్తు వచ్చింది. తమకు కేటాయించిన భూమికి బదులు సమీపంలో మరో భూమిని కేటాయించాలని, ఆ ప్రక్రియలో స్టాండ్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయించాలని ఆ దరఖాస్తు సారాంశం. దానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతిమంగా దీనికి సంబంధించిన అధికారిక పత్రాలు అన్నింటినీ సేకరించి, తరచి చూస్తే డీఎల్‌ఎఫ్ లిమిటెడ్‌కు చేసిన 31.35 ఎకరాల భూ కేటాయింపుల్లో అంతిమ లబ్ధిదారు మై హోం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ అన్నది సుస్పష్టమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతిమంగా మైహోం కు భూమిని కట్టబెట్టడానికే డీఎల్‌ఎఫ్ ద్వారా ఈ తతంగం జరిగిందని, ఈ ప్రక్రియలో ఒప్పందాలు, నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు చేయడమేగాక, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా స్టాండ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని పిటిషన్‌లో వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఏపీఐఐసీగా ఉన్న సంస్థ తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్‌ఐఐసీగా మారిందని, అంతిమంగా ఈ సంస్థ ద్వారానే అన్ని రకాల అక్రమాలకు తెరలేచిందని అదన్నారు. ఇలా అక్రమంగా జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.