క్రైమ్/లీగల్

‘రైతుబంధు’కు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుబంధు పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు బంధు రెండో విడత, మూడో విడత నిధులు ఇంకా విడుదల కాలేదని రిటైర్డు డిఎస్పీ రాఘవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. ప్రభుత్వం తలపెట్టిన రైతుబంధు పథకం రెండో విడత, మూడో విడత డబ్బులు రాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మాజీ డీఎస్పీ రాఘవరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు రావల్సిన రైతు బంధు పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదని.. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది డీఎల్ పాండు తన వాదనలను వినిపించారు.