క్రైమ్/లీగల్

వరకట్న దాహానికి మరో వివాహిత బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఫిబ్రవరి 13: వరక ట్నం కోసం తనను వేధిస్తున్న భర్త వైఖరికి విసిగి వేసారిన భార్య ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకుని మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వ చ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యనమలకుదురులోని శివ పార్వతినగర్‌కు చెంది న కొట్ని రాముకు ఉయ్యూరు గ్రామానికి చెందిన నాగమణి (29)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్ద రు పిల్లలు కలిగారు. పెళ్లిలో రూ.2ల క్షలు వరకట్నంగా తీసుకున్న రాము ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వరక ట్నం కోసం నాగమణిని తరుచుగా వే ధిస్తూ, తాగొచ్చి హింసిస్తూ ఉండేవా డు. బుధవారం నాడు కూడా కట్నం డ బ్బులు తీసుకుని రావాలని కొట్టడంతో తల్లికి ఫోన్ చేసి తన బాధను తెలుపుకుంది. రేపు వచ్చి అల్లుడితో మాట్లాడుతాను నీవు బాధపడవద్దని ధైర్యం చె ప్పింది. కానీ గురువారం ఉదయం భ ర్త ఆటో తీసుకుని బయటకు వెళ్లగా పి ల్లలు నిద్ర పోతున్నారు. ఇదే సమయం లో నాగమణి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరిపోసుకుంది. ఉయ్యూరు నుండి వచ్చిన తల్లి కుమారై ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తమ కుమారై చావుకు అల్లు డే కారణమంటూ గొల్లుమంది. పోలీసులకు సమాచారం అందటంతో సీఐ ముత్యాల సత్యనారాయణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ ఐ తమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.