క్రైమ్/లీగల్

కేటీఆర్ పీఏనంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ నాగుజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు కోకరా వేశాడు. దీంతో పాటు ఈనెల 9వ తేదీన కేటీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఎల్‌బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం సభలో స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు చివరికి పోలీసులకు చిక్కాడు. నాగరాజు చీటర్ అని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకాకుళంకు చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెటర నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.