క్రైమ్/లీగల్
స్కూల్ ప్రధాన ద్వారం విరిగిపడి బాలుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 February 2020
ఖైరతాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల ప్రధాన ద్వారం విరిగిపడి బాలుడు మృతిచెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దమ్మనగర్లో నివాసం ఉండే మోహన్ కుమారుడు రాజేష్ స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బోరబండలోని ఎన్ఆర్ఆర్పురంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల వద్దకు వచ్చాడు. గేటు ఎక్కి ఆడుతుండగా కుప్పకూలింది. రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి తరలిస్తుండగా మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసిఉద్దీన్ పరిశీలించారు.