క్రైమ్/లీగల్

బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్: దైవ దర్శనానికి సిద్ధిపేట జిల్లా కొమురవెల్లికి వెళ్తూ ప్రమాదవశాత్తు అల్గునూరు మానేరు బ్రిడ్జిపై నుండి కిందపడి ఒకరు మృతి చెందగా, బ్రిడ్జిపై నుంచి ప్రమాద సంఘటనను పరిశీలిస్తున్న కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన సంఘటన అల్గునూరులో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన గండి శ్రీనివాస్ (40), అతని భార్య స్వరూప సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి దైవదర్శనానికి వెళ్తూ కరీంనగర్-హైదరాబాద్ రహదారిపై ఉన్న అల్గునూరు బ్రిడ్జి పైకి కారు రాగా లారీని ఓవర్‌టేక్ చేయబోగా కారు బ్రిడ్జి నుంచి కిందకు పల్టీ కొట్టింది. కారులో ఉన్న గండి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య స్వరూపకు తీవ్ర గాయాలు కాగా చికిత్సనిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలిస్తుండగా చంద్రశేఖర్‌గౌడ్ (56) అనే కానిస్టేబుల్ బ్రిడ్జిపై నుండి పడిపోగా, తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ వేములవాడ మండలం వట్టెంల చంద్రశేఖర్ రెండు ఏళ్ళలో రిటైర్ కానున్నాడు. ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని రోదించారు. మృతి చెందిన శ్రీనివాస్ ఉప్పురమల్యాల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీ్ధర్ తెలిపారు.

*బ్రిడ్జి కింద పడిపోయిన కారు,
*ఇన్‌సెట్‌లో *మృతి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, *కానిస్టేబుల్ చంద్రశేఖర్ గౌడ్ (ఫైల్ ఫొటోలు)