క్రైమ్/లీగల్

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, ఫిబ్రవరి 19: అప్పులభాధ తట్టుకోలేక వ్యక్తి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని చింతలపాడులో బుధవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం చింతలపాడు గ్రామానికి చెందిన కురగంటి శ్రీను (32) అనే వ్యక్తి 3ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పెట్టుబడుల నిమిత్తం 4లక్షలు అప్పు తెచ్చి పెట్టగా ప్రకృకి సహకరించక అప్పులు పెరిగి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం సాగు చేస్తున్న పంట పొలంకు వెళ్లి పురుగుమందు త్రాగటంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని నందిగామ పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై మణికుమార్ తెలిపారు.