క్రైమ్/లీగల్

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబేపల్లె, నవంబర్ 19: మండల పరిధిలోని శెట్టిపల్లె సమీపంలో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న వారిపై పోలీసులు దాడుల చేయగా 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు తెలిపారు. సోమవారం సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సయ్యద్‌హషంతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు శెట్టిపల్లె గ్రామం పాలెంగడ్డ వద్ద ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందన్నారు. వెంటనే ఎస్‌ఐ హషం సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా ఇది పసిగట్టిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడి చేశారన్నారు. తమ సిబ్బంది ప్రతిదాడులు నిర్వహించగా 20 ఎర్రచందనం దుంగలను, జైలో వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. వెంటనే తమ సిబ్బంది కూడా స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదన్నారు. తొందరలోనే స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.