క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, సెప్టెంబర్ 17: ఓ గుర్తుతెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సోమవారం సంగం మండల పరిధిలోని పెరమన గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం కడప జిల్లాలోని దర్గాను దర్శించుకుని తిరిగి కారులో నెల్లూరు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.