క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 17: మనస్పర్థలతో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శంకర్‌పల్లి మండలం టంగటూరులో రాత్రి 11గంటల ప్రాంతంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, సంజీవ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని టంగటూరు గ్రామానికి చెందిన ఎల్లేశ్ (22), లావణ్య (19) కొన్నాళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కాగా ఆదివారం ఫోన్‌లో ఇద్దరూ గొడవ పడ్డారని, దీంతో మనస్థాపం చెందిన ఎల్లేశ్ గ్రామ సమీపంలోగల వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లేశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుకున్న లావణ్య భావోద్రేకానికి గురై ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకే కులానికి చెందినవారని వరసకు బావామరదళ్లు కూడా అవుతారు. తల్లిదండ్రుల
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐలు తెలిపారు.