క్రైమ్/లీగల్

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 24 అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన కిష్టమ్మగారి రవిందర్ గౌడ్ (38) అనే యువ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని భార్య భాగ్యమ్మ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గత రెండు సంత్సరాల క్రితం అప్పులు చేసి గల్ఫ్ కు వెళ్లినాడని, అక్కడై సరైన వేతనాలు లేకపోవడంతో చేసిన అప్పులు తీరలేదన్నారు. దీంతో ఇంటికి చేరుకుని పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికి చేసిన అప్పులు తీర్చే దారిలేకుండా పోయిందన్నారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెల్లిన రాజెందర్ రాత్రి వరకు ఇంటికి రాలేదని వివరించింది. తన మరిది, మామయ్యలు అతని ఆచూకి కోసం వెదికగా రాత్రి పది గంటలకు రాజేందర్ చెట్టుకు ఉరి వేసుకుని కన్పించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అతన్ని ఆ చెట్టు నుంచి కిందికి దించి చూడగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు వివరించారు. మృతునికి కుమారుడు, కూతరు ఉన్నారని గ్రామస్తులు వివరించారు. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.