క్రైమ్/లీగల్

నిమజ్జనంలో విషాదం ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణేష్ నిమజ్జానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...మహరాజ్ గంజ్ ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అయిందల అనంతి కుమారుడు అయిందల వేణు(20) చిక్కడపల్లిలో ఓ కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘోడే కి కబర్ గోషామహల్‌కు చెందిన నింభవత్ నౌరంగల్ కుమారుడు నింభవత్ సురేష్ (50) బాస్మతి రైస్ క్లీనింగ్ చేస్తుంటాడు. అయితే ఆదివారం గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని సురేష్ ఇంట్లో ఏర్పాటుచేసిన గణనాథున్ని నిమజ్జనం చేసేందుకు ద్విచక్ర వాహనంపై గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని వీరభద్రస్వామి దేవాలయం పక్కన ఉన్న మూసి కాలువవద్దకు వెళ్లారు. దేవాలయం వద్ద పూజచేసి నిమజ్జనం చేసేందుకు మూసి కాలువలోకి దిగారు. ఈక్రమంలోప్రమాదవశాత్తు ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించి వెతకగా, నీటిలో మునిగిపోయిన రెండు మృతదేహాలను బయటికి తీశారు.