క్రైమ్/లీగల్

తాతను హతమార్చిన మనవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, జూన్ 10 : చేతబడి చేశాడనే నెపంతో ఓ తాతను మనవడు పీక కోసి హతమార్చిన సంఘటన శనివారం అర్ధరాత్రి విజయపురిసౌత్ పరిధిలోని 7వ మైలు చెంచు కాలనీలో చోటుచేసుకుంది. శీలం నరసింహం (75) కొంతకాలంగా చెంచు కాలనీలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. నరసింహం మనవడు శీలం అంజికి చేతబడి చేశాడనే నెపంతో అంజి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం తాగి కూరగాయలు కోసే కత్తితో నరసింహం పీక కోసి హత్య చేశాడు. విజయపురిసౌత్ ఎస్సై సిహెచ్ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శీలం నరసింహం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదివారం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు శీలం అంజి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని మాచర్ల రూరల్ సిఐ దిలీప్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు.