క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభం, జూన్ 10: విశాఖ జిల్లా, పద్మనాభం మండలంలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రెల్లిపేటలో బాలికపై అత్యాచారం జరిగింది. శనివారం మధ్యాహ్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు స్థానిక సీఐ ప్రభాకర్ చెప్పారు. ఆయన అందించిన వివరాలివి. రెల్లిపేటలో పదేళ్ళ వయస్సు గల బాలిక, ఇదే రెల్లిపేటకి చెందిన బంగారి ఈశ్వరరావు (21) ఆ పేటకు సమీపంలోని మామిడి తోటలో పశువులు కాస్తున్నారు. అయితే, వారి సమీపంలో ఎవరూ లేకపోవడంతో అదును చూసుకొని ఈశ్వరరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక స్పృహ తప్పి మామిడి తోటలో పడిపోయింది. ఈ సంఘటనను తెలుసుకున్న తల్లిదండ్రులు బాధితురాలిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మధురవాడ ఏసీపీ దర్యాపు చేస్తున్నట్టు సీఐ ప్రభాకర్ చెప్పారు.
ధర్మసంకల్పం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?!