క్రైమ్/లీగల్

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, జూన్ 12: ఓ కామాంధుడు మద్యం మత్తులో వావి వరసలు మరచి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తె అయిన ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దురాగతం గుంటూరు జిల్లా మండల కేంద్రమైన కాకుమానులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన కొమరగిరి లక్ష్మయ్య అక్కడ పనులకు స్వస్తిచెప్పి కాకుమానులోని తల్లివద్దకు వచ్చి ఏడాది కాలంగా కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇక్కడ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఇంటికి సోమవారం అర్ధరాత్రి వెళ్లి, ఆ ఇంట్లో ఉన్న ఆమె కుమార్తె (ఎనిమిదేళ్ల చిన్నారి)పై అత్యాచారం చేశాడు. ఈ దారుణం తెలుసుకుని ఆగ్రహించిన ఆ చిన్నారి తల్లి కాకుమాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిపై అత్యాచారం చేసిన లక్ష్మయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాకుమాను ఎస్‌ఐ అంజయ్య నిర్భయ చట్టం కింద లక్ష్మయ్యపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న బాపట్ల డీఎస్పీ గంగాధర్, పొన్నూరు రూరల్ సీఐ తిరుమలరావు వివరాలు సేకరిస్తున్నారు.