క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా:బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూన్ 21: మండల పరిధిలోని పెన్నా సిమెంట్ కర్మాగారం సమీపంలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఆసీఫ్(12) బాలుడు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనాయి. కర్నూలు జిల్లా తిమ్మనాయినిపేట గ్రామానికి చెందిన వారు హాజీవలి దర్గాలో కేశ ఖండన కార్యక్రమం ముగించుకొని గ్రామానికి ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 20మంది వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా నడుపడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడగా, ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్న ఆసీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన క్షతగాత్రులు బడేహజీ, ఉశేన్‌పీరా, వలి, బేగం, చౌడప్ప, సుధాకర్‌లను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బడేహాజీ, ఉశేన్‌పీరాల పరిస్థితి విషమించడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.