క్రైమ్/లీగల్

ఉపాధి కూలీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూన్ 21 : మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీగా పనిచేసే బాలచంద్రమోహన్ (42) పురుగులు మందు తాగి గురువారం మధ్యాహ్నం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలచంద్రమోహన్ భార్య లక్ష్మితో కలిసి గురువారం ఉపాధి పనులకు వెళ్ళాడు. పనులు ముగించుకుని కూలీలతోపాటు రాకుండా ఆలస్యంగా వస్తూ మార్గమధ్యలోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడంతో లక్ష్మితోపాటు కూలీలు వెనుతిరిగి వెళ్ళడంతో అపస్మారక స్థితిలో పడి వున్న చంద్రమోహన్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలోనే చంద్రమోహన్ మరణించినట్లు తెలిపారు. కాగా మృతుడు కుటుంబ పోషణ నిమిత్తం దాదాపు రూ.2లక్షలకు పైగానే అప్పులు చేయడంతో ఇటీవలె అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుండి వత్తిడి ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తిచెంది పురుగుల మందు సేవించి వుండవచ్చునని తెలిపారు. ఈ సంఘటనపై రూరల్ ఎస్‌ఐ గోపాలుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.