క్రైమ్/లీగల్

బంగారు నగలు మెరుగు పేరుతో బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓజిలి, జూన్ 21: బంగారు నగలకు మెరుగు పెడతామని చెప్పి ఇద్దరు మహిళలను బురిడీ కొట్టించి 8 సవర్ల బంగారు ఆభరణాలను స్వాహా చేసిన సంఘటన గురువారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఓజిలి మండలంలోని చిలమానుచేను గ్రామానికి చెందిన ముంతల ప్రమీలమ్మ, ఆమె కోడలు భారతి ఇద్దరు ఇంటిలో ఉండగా గుర్తుతెలియని ఓ ఇద్దరు వ్యక్తులు వారి ఇంటికి వచ్చారు. బంగారు నగలకు మెరుగు పెడతామని చెప్పడంతో వారి మాటలు నమ్మిన అత్తాకోడళ్లు తమ మెడలో ఉన్న 8 సవర్ల బంగారు నగలను వారి చేతికి ఇచ్చారు. ఆ మోసగాళ్లు ఇద్దరు సదరు బంగారు వస్తువులను తెలివిగా తమ వద్ద ఉంచుకొని నకిలీ వస్తువులను నీటిలో వేసి కొంత సమయం తరువాత బంగారు నాణెంగా తయారవుతుందని తీసుకోవచ్చని నమ్మబలికి బంగారంతో ఉడాయించారు. సదరు వ్యక్తులు వెళ్లిన గంట సమయం తరువాత బంగారాన్ని చూసుకోవడంతో నకిలీ బంగారు వస్తువులుగా గుర్తించారు. ఈవిషయంపై బాధిత మహిళలు ఓజిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.