క్రైమ్/లీగల్

మోర్జంపాడులో పట్టపగలు వృద్ధ దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచవరం, జూన్ 21: మండలంలోని మోర్జంపాడులో గురువారం పట్టపగలు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయ. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దుగ్గు పుల్లారెడ్డి (65), భార్య పూర్ణమ్మ (60)ను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగులు గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చారు. ఆ సమయంలో అన్నం వండుకునేందుకు చాటలో బియ్యంతో ఉన్న పూర్ణమ్మను హతమార్చడంతో బియ్యం చేటలోనే కుప్పకూలిపోయింది. పుల్లారెడ్డి ఇంటి వెనక భాగంలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డి సమీపంలో కుర్చీలో కూర్చుని ఉండగా అతన్ని కూడా గొంతుకోసి చంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కార్పెంటర్ డబ్బుల కోసం తలుపు తీసేసరికి భార్యాభర్తలు ఇద్దరూ రక్తపు మడుగులో ఉండడాన్ని చూశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. పట్టపగలే దంపతుల హత్య జరగడం ఆందోళన కలిగించింది. ఎవరన్నా డబ్బు కోసం ఈ పని చేసి ఉంటారా, లేక బంధువులే చేయించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుమారుడు నరిసింహారెడ్డి బుధవారం మోర్జంపాడులోని వివాహ వేడకకు హాజరయ్యాడు. ఇతను అద్దంకిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వివాహనంతరం తన తండ్రితో ఆస్తి పంపకాలపై గొడవ పడినట్లు పోలీసుల సమాచారం. ఆస్తి కోసమే ఇలా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి డిఎస్పీ కాలేషావలి, పిడుగురాళ్ళ రూరల్ సిఐ సుబ్బారావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ జయకుమార్, జాన్‌వలి క్లూస్‌టీంను రప్పించారు. వేలిముద్రల పరిశీలన అనంతరం పూర్తి సమాచారం తెలుపుతామని పోలీసులు చెప్పారు. విషయం తెలిసినా కుమారుడు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.