క్రైమ్/లీగల్

మద్యం మత్తులో పోలీసులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, జూన్ 21: మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసి దుర్భాషలాడిన వ్యక్తులపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పట్టణంలోని అశోక్‌నగర్ గజలమ్మ కమాన్ వద్ద గస్తీ తిరుగుతున్న కానిస్టేబుళ్లు దేవేందర్, శ్రీనివాస్‌లు మద్యం మత్తులో శ్రీనివాసకాలనీకి చెందిన వేణు, ఊట్కూరుకు చెందిన రాజీవన్‌రెడ్డి అనుచితంగా వ్యవహరిస్తుండగా వారిని ఇళ్లకు వెళ్లాలని సూచించగా వారు తమపై దాడి చేసి బండబూతులు తిట్టారని ఎస్సైకి లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. మద్యం మత్తులో తమపై జరిపిన దాడిలో తన చొక్కా గుండి చిరిగిపోగా పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించి అందులో వేణు అనే యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా పోలీస్‌స్టేషన్‌లోనే తమపై చేతులు, కాళ్లతో దాడి చేశాడని ఇతడిపై చట్టరిత్యా కఠిన చర్యలు చేపట్టాలని పిర్యాదు చేశారు. కాగా తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి ఉపక్రమించిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.