క్రైమ్/లీగల్

అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, జూన్ 21: నియోజకవర్గ కేంద్రంలోని ధనగర్ గల్లిలో బుధవారం రాత్రి అత్తారింటికి అల్లుడు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. సంఘటనకు సంబంధించిన వివరాలను ముధోల్ ఎస్సై భరత్ సుమన్ తెలిపారు. రోళ్ల మారుతి తన మామ, అత్త అయిన తెలగడం చిన్న లింగన్న, కళాబాయి ఇంటి వెనుక వైపు నుండి రేకుల పెకప్పు తీసి కిరోసిన్ పోసి నిప్పంటించాడని అన్నారు. ఇంట్లో నిద్రపోతున్న మామ లింగన్న, అత్త కళాబాయి, భార్య రోళ్ల బాగ్యలక్ష్మీ, కుమారులు ఈశ్వర్, మల్లెష్‌కు గాయాలయ్యాయి. గత కొన్ని నెలల నుండి భాగ్యలక్ష్మీని మారుతి ప్రతీ రోజు కొట్టెవాడని అన్నారు. మద్యానికి బానిసైన రోళ్ల మారుతి భార్యను కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. కిరోసిన్ పోసి భార్యతో పాటు పిల్లలు, అత్తమామలను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఇంట్లోని సామాగ్రి సహితం దగ్దమైందని వివరించారు. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమితం తరలించినట్లు తెలిపారు. తనకన్న కొడకులను సహితం కనికరించకుండా నిప్పుపెట్టి హత్య చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మానవమృగంగా ప్రవర్తించడం మానవత్వానికే మాయని మచ్చని పలువురు స్థానికంగా చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ముధోల్ సీ ఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ సుమన్ పరిశీలించి వివరాలను సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.