క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగురాళ్ల, జూన్ 23: బాలుడు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ మండల పరిషత్ హైస్కూల్‌లో శనివారం జరిగింది. లెనిన్ నగర్ కాలనీకి చెందిన కాంతారావు, కాంతమ్మల కొడుకు అశోక్ (14) గురువారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి రాత్రికి కూడా రాకపోవడంతో శనివారం ఉదయం బాలుని తండ్రి పలుచోట్ల వెతుకుతుండగా పాఠశాల గదిలో ఉరి వేసుకున్నట్లు గమనించిన కొందరు స్థానికులు విషయం బాలుని తండ్రికి తెలియజేశారు. దీంతో పోలీసులకు సమాచారం అందింది. బాలుని తండ్రి మాట్లాడుతూ బాలుడిని ఎవరూ ఏమీ అనలేదని, ఉరి వేసుకుని చనిపోయే ధైర్యం కుమారుడికి లేదని తెలియజేయడంతో పట్టణ ఎస్‌ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డిఇఓ గంగాభవాని మృతుని తల్లిదండ్రులను ఇంటికి వె ళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమన్నారు.