క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, జూన్ 23: ప్రేమించినవాడి చేతిలో మోసపోయిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పునాదిపాడులో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పునాదిపాడు బీసీ కాలనీలో నివసించే లోయ రాణి(24) మైలవరంలోని లకిరెడ్డి బాలరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గత సంవత్సరం ఈసీఈ పూర్తిచేసుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటోంది. ఆమె ప్రేమించిన వ్యక్తి మోసగించినట్లు గుర్తించి తీవ్ర మనస్థాపానికి గురైంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె తల్లి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందగా తండ్రి శ్రీమన్నారాయణ వ్యవసాయ కూలీగా, తమ్ముడు టాపీ పని చేస్తుంటారు. వీరిద్దరూ కష్టపడి రాణిని ఇంజినీరింగ్ చదివించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె శనివారం ఉదయం తండ్రి, తమ్ముడు పనులకు వెళుతుంటే మధ్యాహ్న భోజనం క్యారియర్ కూడా ఇచ్చి పంపింది. తండ్రి వ్యవసాయ పనులు ముగిశాక ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో పలుమార్లు రాణిని పిలిచాడు. స్పందన లేకపోవటంతో తలుపులు తెరిచి చూడగా రాణి దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే పక్కనే ఉన్న కత్తితో దూలానికి కట్టి ఉన్న చున్నీని కోసి రాణిని కిందికి దించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో చుట్టపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ శివాజీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతురాలి తండ్రి సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ఉన్న ఆధారాలను బట్టి ప్రేమ విషలమవ్వటంతోనే ఆమె మృతి చెందిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.