క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న కారు.. యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జూన్ 23:కోడుమూరు, ప్యాలకుర్తి గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన మధుసుధాకర్(28) మృతిచెందాడు. వివరాలు.. మధుసుధాకర్ ఉదయం ద్విచక్ర వాహనంపై మండల పరిధిలోని ప్యాలకుర్తి గ్రామానికి వచ్చాడు. ఇక్కడ పని ముగించుకుని చంద్రశేఖర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కోడుమూరుకు వస్తుండగా ఎమ్మిగనూరు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీ కొంది. ఈ సంఘటనలో మధుసుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి గొల్ల చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అలాగే గాయపడిన చంద్రశేఖర్‌ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.