క్రైమ్/లీగల్
రైలు కిందపడి యువకుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 June 2018
గిద్దలూరు, జూన్ 23: గిద్దలూరు రైల్వేస్టేషన్ సమీపంలో గిద్దలూరు - నంద్యాల వైపు సగిలేరు బ్రిడ్జికి, అంబవరం గేటు బ్రిడ్జికి మధ్యలో యువకుడు గూడ్స్బండి కిందపడి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. వివరాల మేరకు గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన బేరంగుల రామయ్య (35) శనివారం గుంటూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న గూడ్స్బండి కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. నంద్యాల రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.