క్రైమ్/లీగల్

కిరాణా దుకాణంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 18: సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌లో ఒక కిరాణం వ్యాపారి ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపి రూ.50 వేల విలువ గల నిషేదిత గుట్కా, అంబర్లు, ఇతర పాన్ మసాలాలు పట్టుకున్నారు. ఆదివారం టాస్క్ ఫోర్స్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో సాయినగర్‌లోని పడకండి వెంకటేశం(32) అనే వ్యాపారికి చెందిన కిరాణ దుకాణంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఇందులో నిషేధిత గుట్కాలు, అంబర్‌లు, ఇతర పాన్ మసాలాలకు చెందిన సుమారు ఎనిమిది వేల ప్యాకెట్లను స్వాథీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇతడిపై చట్టపరమైన చర్యల కోసం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ సీఐ బన్సీలాల్ తెలిపారు.