క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 24: స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి అదుపు తప్పి కింద పడటంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందిన విషాధ సంఘటన మొవ్వ మండలం బార్లపూడి, నర్సంపాలెం పీఆర్ రహదారిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ సమాచారం మేరకు కూచిపూడి గ్రామానికి చెందిన జన్ను సీతారామయ్య పెద్ద కుమారుడు మురళీకృష్ణ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆదివారం నర్సంపాలెంలోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. విద్యలో మేటి అయిన మురళీకృష్ణ ఆకస్మిక మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లుతున్నారు.