క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి రూరల్, జూలై 16: కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంలో నివాసముంటున్న మహమ్మద్ హనీఫ్ కుమారుడు హసేన్‌బాషా (22) సోమవారం కర్నాటక రాష్ట్రం బిళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హుసేన్‌బాషా చెల్లె అయిన యాష్మిన్‌ను బిళ్లూరుకు చెందిన ఓ అబ్బాయితో వివాహం చేశారు. చెల్లె, బావను చూసేందుకు హుసేన్‌బాషా కాళసముద్రం నుండి ద్విచక్ర వాహనంలో బిళ్లూరుకు బయల్దేరాడు. అయితే చెల్లెలు ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న హుసేన్‌బాషా మార్గమధ్యలో అతని బావకు సంబంధించిన బంధువు, కర్నాటకకే చెందిన మరో 20 ఏళ్ల అబ్బాయిని ద్విచక్ర వాహనంలో ఎక్కించుకున్నాడు. వీరిరువురు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా బిళ్లూరు సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హసేన్‌బాషాతోపాటు ఆ అబ్బాయి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు విషయాన్ని బిళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నట్లు హుసేన్‌బాషా బంధువులు తెలిపారు.