క్రైమ్/లీగల్

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం)/ రైల్వేస్టేషన్, జూలై 16: సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ కక్షలను పురస్కరించుకుని స్వయానా బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కుంకుడుమల్లి గ్రామానికి చెందిన చదలవాడ రాజు(33) రైల్వేలో గేట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన సోదరి భర్త అయిన కె శేఖర్ కూడా విజయవాడలో రైల్వే ఉద్యోగి. గేట్‌మెన్ రాజు ఈ నెల 13న శిక్షణ కోసం విజయవాడ వచ్చాడు. సత్యనారాయణపురంలోని రైల్వే గేట్‌మెన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం కూడా శిక్షణ తరగతులకు హాజరయ్యాడు. ఈయన బావమరిది శేఖర్ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్లలో నివాసముంటున్నాడు. భార్యతో కొద్దిరోజులుగా నెలకొన్న విభేదాల నేపథ్యంలో గేట్‌మెన్ రాజు బావమరిది వద్దకు వచ్చి కుటుంబ తగాదాల విషయమై చర్చించి వెళుతున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి వీరిద్దరూ గొడవ పడ్డారు. దీన్ని పురస్కరించుకుని యథావిధిగా సోమవారం తరగతులకు వచ్చిన రాజును కలిసేందుకు వచ్చిన శేఖర్ మధ్యాహ్నం భోజనం అనంతరం ఇన్‌స్టిట్యూట్ గేటు వద్ద కలిసి గొడవపడ్డాడు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో రాజును విచక్షణా రహితంగా పొడవడంతో మెడ, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చూసి వెంటపడేసరికి శేఖర్ మోటార్ బైక్ వదిలి ఆటో ఎక్కి పరారైనట్లు పోలీసులు వివరించారు. కత్తిపోట్లకు గురైన రాజును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం సీఐ పి కనకారావు సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. హతుని తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు వివరించారు.