క్రైమ్/లీగల్

విస్తృత తనిఖీల్లో రేషన్ బియ్యం, ఇసుక ట్రాక్టర్‌లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూలై 16: ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ మండల పరిధిలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమంచిపల్లి వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక వాహనంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 60 బ్యాగ్‌ల బియ్యంను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బలుసుపాడు అడ్డరోడ్డులో ఆటోలో తరలిస్తున్న 395 కిలోల రేషన్ బియ్యంను ఆటోతో సహా స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా మండలంలోని సరిహద్దు గ్రామం అన్నవరం మీదుగా తెలంగాణా ప్రాంతానికి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి మూడు ఇసుక లోడ్ ట్రాక్టర్‌లతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఓల్టా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.