క్రైమ్/లీగల్

మోటారు బైకులు ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూలై 17: సత్తెనపల్లి మండల పరిధిలోని పాకాలపాడు గ్రామానికి వెళ్లు ప్రధాన రహదారిలోవున్న రెండవ వంతెన సమీపంలో అడ్డుగా వచ్చిన బైకును ఢీకొన్న బైకు చోదకుడు అక్కడికక్కడే మృతి చెందగా వేరొక బైక్‌పైవున్న వ్యక్తికి కాలువిరిగి తీగ్రగాయాల పాలైనాడు. సత్తెనపల్లి రూరల్ ఎస్సై నజీర్‌బేగ్ తెలిపిన సమాచారం మేరకు స్థానిక సంఘంబజారుకు చెందిన సైదులు (32) పెయింటింగ్ వేసేందుకు పెయింట్ డబ్బాలను బైక్‌పై పెట్టుకొని పాకాలపాడు గ్రామానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలోని రెండవ వంతెన వద్దకు రాగానే అడ్డంగా పొలం నుండి రోడ్డు ఎక్కిన రైతుబైక్‌ను సైదులు బైక్ బలంగా ఢీకొనడంతో సైదులు తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైతుకు కాలువిరగడంతో హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. సైదులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు ఎస్సై నజీర్‌బేగ్ కేసునపమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.