క్రైమ్/లీగల్

ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, జూలై 17 : మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న గిరిజ (24) మంగళవారం హేమావతిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎఎస్సై వీరన్న తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన కృష్ణయ్య, జయలక్ష్మీ కుమార్తె గిరిజ 2014 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై మండల పరిధిలోని ఎర్రగుంటపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తోంది. ఈమధ్యకాలంలో కంటి నొప్పి అధికంగా ఉండటంతో శస్త్ర చికిత్స చేయించుకుంది. అయితే ఇటీవల కాలంలో చూపు తగ్గడంతోపాటు తలనొప్పితో బాధపడుతుండేది. సోమవారం తల నొప్పి అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.