క్రైమ్/లీగల్
గంజాయి నిందితులకు పదేళ్ల జైలుశిక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 July 2018
చోడవరం, జూలై 17: గంజాయి అక్రమ రవాణా నింధితులకు జిల్లా కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎస్ఐ మల్లేశ్వరరావు అందజేసిన వివరాలిలావున్నాయి. 2013వ సంవత్సరంలో ఏజెన్సీ నుండి 74కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నింధితులు జి. మాడుగులకు చెందిన ఎ. ప్రసాద్, చోడవరానికి చెందిన జె. సత్యనారాయణ, రోలుగుంఠకు చెందిన ఎ. స్వామినాయుడు అక్రమంగా రవాణా చేస్తుండగా అప్పటి ఎస్ఐ జి. శ్రీనివాసరావు దాడులు నిర్వహించి నింధితులను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లాకోర్టు నింధితులకు పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పువెల్లడించిందని ఎస్ఐ తెలియజేసారు.