క్రైమ్/లీగల్

చెక్కల మిల్లులో రంపం బ్లేడుపై పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జూలై 17: చెక్కల మిల్లులో రంపం తగిలిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంల కేంద్రమైన మాకవరపాలెం గ్రామానికి చెందిన తెల్లా నూకరాజు(48) తామరం సెంటర్ సమీపంలో ఉన్న చెక్కల మిల్లులో గత కొంత కాలంగా కట్టర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా నూకరాజు మిల్లులో పనికి వెళ్ళాడు. అక్కడ రంపం దారుపెడుతుండగా ప్రమాదవశాత్తు అతను దానిపై పడడంతో మెడ భాగంలో తీవ్రమైన గాయం కావడంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్‌కుమార్ కేసు నమోదు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయామని మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.