క్రైమ్/లీగల్

సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 19: హెచ్‌సీయూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది అపార్టుమెంటు పైనుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడుపల్లికి చెందిన ఎస్.హర్షిత (21) గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కాగా గురువారం మధ్నాహ్నం ఒంటిగంట సమయంలో నల్లగండ్ల సమీపంలోని హిమసాయి లేక్‌వ్యూ అపార్టుమెంటు చివరిదైన 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మొదటి సంవత్సరం భౌతిక శాస్త్రంలో ఫెయిల్ అయినందున తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అటు ఇంటివద్ద కాకుండా ఇటు యూనివర్శిటీలో కాకుండా మధ్యలో నల్లగండ్ల సమీపంలోని అపార్టుమెంటుపై నుంచి దూకడం పలు అనుమానాలకు తావిస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగయ్య దర్యాప్తు చేస్తున్నారు.