క్రైమ్/లీగల్

రెండు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు,్ఫబ్రవరి 20: తొర్రూరు డివిజన్ కేంద్రం శివారు పాలకేంద్రం, దుబ్బతండా పరిసర ప్రాంతాల్లో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రెండు వేర్వేరు రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైయ్యారు. తొర్రూరు శివారు దుబ్బతండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైజ్‌కు నుండి వరంగల్‌కు ఐరెన్‌రాడ్డు లోడుతో వస్తున్న ఎపి 02పిఎ7389నెంబరు గల లారీ, వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న టాటా ఇటాచ్‌ను తీసుకెళ్తున్న పంజాబ్‌కు చెందిన పిబి 06ఎకె7613నెంబరు గల లారీని ఢికొట్టడంతో ఇనుప కడ్డిల లారీ డ్రైవర్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోద్యపురం గ్రామానికి చెందిన బాషికాల రవి(35) అక్కడికక్కడే మరణించాడు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరుగడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై తాహెర్‌బాబా, ఆర్డివో కృష్ణవేణి, డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, సర్పంచ్ రాజేష్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్లియర్‌చేశారు. అదేవిధంగా తొర్రూరు డివిజన్ శివారు పాలకేంద్రం సమీపంలో మరొక్క రోడ్డు ప్రమాదంలో ఒ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. టిఎస్ 04యుఎ 0660నెంబరు గల లారీ పెంట్రోల్‌బంక్ వద్ద బైక్‌ను ఢికొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొర్రూరు పోలీసులు మృతులను పొస్టుమర్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.