క్రైమ్/లీగల్

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 29: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నిమ్మనపల్లె మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లె ఎస్‌ఐ హరిహరప్రసాద్ కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలానికి చెందిన విద్యార్థిని గ్రామం నుంచి ప్రతిరోజూ అందుబాటులో ఉన్న వాహనంలో మదనపల్లె కళాశాలకు వెళ్తోంది. శనివారం కూడా కళాశాలకు వెళ్లేందుకు రాగా, అక్కడ సి వెంకటేష్ అనే ఆటోడ్రైవర్ ఉన్నాడు. వి వెంకటేష్ అనే వ్యక్తి వెనుక సీటులో కూర్చుని ఉండగా, ఆమె కూడా అదే ఆటోలో బయలుదేరింది. ఆటో గ్రామానికి కొంతదూరం వెళ్లాక దారిమళ్లించి నల్లగుట్ట వద్దకు తీసుకెళ్తుండగా విద్యార్థిని బిగ్గరగా కేకలు వేసింది. వెనుక సీటులో ఉన్న వెంకటేష్ ఆమె నోటిని గుడ్డతో అదిమిపట్టాడు. అంతలో ఆటో ఆపిన డ్రైవర్ సి వెంకటేష్ అమ్మాయిని, వి వెంకటేష్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో విద్యార్థిని దుస్తులు చించి వి వెంకటేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం వి వెంకటేష్ ఆటోడ్రైవర్ సి వెంకటేష్‌కు ఫోన్‌చేసి రమ్మనగా, అతడు వెంటనే వచ్చాడు. అదే ఆటోలో విద్యార్థినిని ఇంటివద్ద వదలి వెళ్లిపోయారు. తర్వాత ఆమె జరిగిన విషయం తల్లికి చెప్పి, గ్రామస్తుల సహాయంతో నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. ఈమేరకు ఇద్దరు వెంకటేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల కోసం మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ వివరించారు.