క్రైమ్/లీగల్

సెటప్ బాక్స్‌కు విద్యుత్ సరఫరా: మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 30: టీవీ సెటప్‌బాక్స్‌కు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై లకుమాళ్ళ యాదమ్మ (40) అనే మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం రోజు చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామానికి చెందిన యాదమ్మ సోమవారం రోజు టీవీ చూసేందుకు టీవీని అన్‌చేసింది. ఈ క్రమంలో సెటప్‌బాక్స్‌ను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీస్‌లు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పరామర్శించిన జడ్పీ చైర్మన్ బాలు
టీవీ సెటప్‌బాక్స్‌కు విద్యుత్ సరఫరా జరిగి మృతి చెందిన లకుమాళ్ళ యాదమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జడ్పీ చైన్మన్ బాలు నాయక్ హామీ ఇచ్చారు. దేవరకొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో యాదమ్మ శవాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండే విద్యుత్ అధికారులతో మాట్లాడి యాదమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జడ్పీ చైర్మన్ వెంట ఎంపీటీసీ గడ్డం లక్ష్మీ వెంకటయ్య, కొండల్‌రెడ్డి, ఎల్లయ్య, కృష్ణ, నర్సింహ, కొర్ర రాంసింగ్‌నాయక్, బాబూరాం, హరి తదితరులు పాల్గొన్నారు.