క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 30: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామమైన ఆరంబాకం వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. తమిళనాడు పోలీసుల సమాచారం మేరకు తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన శరవణకుమార్ (28), చెన్నై ఆవడికి చెందిన పెరుమాళ్ (24) అనే యువకులు చెన్నైలోని లామినర్ టెక్నికల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. మండలంలోని శ్రీసిటీలో గల ఓ పరిశ్రమలో విధులు నిమిత్తం చెన్నై నుండి శ్రీసిటీకి బైక్‌పై వస్తుండగా ఆరంబాకం వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. ఈప్రమాదంలో శరవణకుమార్, పెరుమాళ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొనే్నరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.