క్రైమ్/లీగల్

దహనమైన మహిళ మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, జూలై 30: ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం మండలంలోని చెన్నారెడ్డిపల్లి - నాగెళ్ళముడుపు రహదారిపై సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం గుర్తుతెలియని మహిళను హతమార్చి ఈ రహదారిలో రోడ్డుపక్కన పడవేసి పెట్రోల్ పోసి దగ్ధం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈసంఘటనకు కారణాలు తెలియరానప్పటికీ ఇది హత్య..? ఆత్మహత్య..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో ఆదివారం జరిగిన హోంగార్డు హత్య సంఘటనను మరువకముందే ఇదే నియోజకవర్గంలోని తర్లుపాడు మండలంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దహనమైన మృతదేహం మహిళదని, దాదాపు 35 సంవత్సరాలు ఉండి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరక్కపోవడంతో పలు హత్యల్లో అనుభవం ఉన్నవారే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళను హతమార్చి రోడ్డుపక్కన పడవేసి పెట్రోల్‌పోసి తగులపెట్టి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏదిఏమైనా మృతురాలు ఏ ప్రాంతానిది చెందినదో ఆచూకీ దొరకడంలేదు. మృతురాలి చేతికి గాజులు, ముక్కుపుడక మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని దర్శి డివైఎస్పీ నాగేశ్వరరావు, పొదిలి సీఐ శ్రీనివాసరావు, తర్లుపాడు ఎస్సై అబ్దుల్ రహమాన్ పరిశీలించారు.