క్రైమ్/లీగల్

ట్రాలీ లారీ ఢీకొని యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, ఆగస్టు 4: ట్రాలీ ఢీకొని ఓ యువతి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పి కోనవలస చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిషా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నారిగాం గ్రామానికి చెందిన చిట్టి ఆశా(26) శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఉద్యోగానికి నిమిత్తం ఇంటర్వ్యూ కోసం తన తండ్రి త్రినాధతో జైపూర్ నుంచి ఒరిస్సా ఆర్టీసి బస్సులో భువనేశ్వర్‌కు బయలుదేరింది. శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో పి కోనవలస చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి ఆశాకు బస్సు ప్రయాణం పడకపోవడంతో వాంతలు అవ్వడంతో బస్సు దిగి ప్రక్కకు వెళ్లగా వెనుక నుంచి వస్తున్న ట్రాలీ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఢీకొట్టిన లారీ నిలుపుదల చేయకుండా వెళ్లిపోవడంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సాలూరులో లారీని పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అయితే మృతురాలు ఉద్యోగం నిమిత్తం ఇంటర్వ్యూకు వెళుతుండగా ఈ సంఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపిస్తున్నారు. ఈమేరకు మృతదేహానికి పోస్టుమార్టం సాలూరు సిహెచ్‌సిలో చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి హెడ్‌కానిస్టేబుల్‌గా జైపూర్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు కాగా ఈమె రెండవ కుమార్తె.