క్రైమ్/లీగల్

బెల్లంపల్లిలో టాస్క్ఫోర్సు పోలీసుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఆగస్టు 4: పట్టణంలోని మంచిర్యాల చందా జాతీయ రహదారి కాల్ టెక్స్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 50క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు సీఐ బుద్దెస్వామి మాట్లాడుతూ మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి నుండి అక్రమంగా మహారాష్టక్రు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్సు ఏసిపి విజయ సారధి ఆధ్వర్యంలో బెల్లంపల్లి జాతీయ రహదారిపై దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడుల్లో 10ఆటోలలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలించడంతో, మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన పి హరీష్, వానరాసి రాంబాబు, ఎస్ శ్రీహరి, చింతల నవీన్, ఎం రాజేష్ పట్టుబడ్డారని తెలిపారు. చింతల రాజేందర్, ఎం శ్రీకాంత్, డి కనకయ్య, టి వెంకటేష్, హాజీపూర్‌కు చెందిన ప్రభాకర్ పారిపోయారన్నారు. పట్టుబడిన వ్యక్తులతోపాటు 50క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒక ఆటో ట్రాలీ, 9 ప్యాసింజర్ ఆటోలను స్వాధీన పరుచుకొని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై వినోద్‌కుమార్‌కు అప్పగించడం జరిగిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో టాస్క్ఫోర్సు సిబ్బంది సంపత్ కుమార్,శ్యాంసుందర్, వెంకటేష్, భాస్కర్ గౌడ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.