క్రైమ్/లీగల్

కార్వేటి నగరంలో ఆడికృత్తికలో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 5: ఆడికృత్తికను పురస్కరించుకుని కార్వేటి నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లిన తిరుపతికి చెందిన దేవి(40) అనే మహిళ స్కంద పుష్కరణిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె స్వామివారి దర్శనానికి ముందు కొలనులో స్నానానికి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు మునిగి పోతున్న ఆమెను కొందరు కాపాడారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. ఆమె శ్వాస తీసుకోక పోవడం గమనించి ప్రాథమిక వైద్యం అందించారు. అయినా ఫలితం లేకోవడంతో పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అప్పటికే దేవి మృతి చెంది ఉండటం గుర్తించారు. దీంతో ఆడికృత్తిక రోజన దేవి మృత్యువాత పడటంతో ఆమె భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది.