క్రైమ్/లీగల్

భర్తను హతమార్చిన భార్య, తనయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, ఆగస్టు 5 : మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తున్న నేప్యెంలో అతని ప్రవర్తను తట్టుకోలేక భార్య, ఇద్దరు కుమారులు హత మార్చిన సంఘటన శనివారం అర్థరాత్రి పొదిలి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానిక బుగ్గచలమా ట్యాంకు సమీపంలో నివాసం ఉంటున్న బళ్ళారి ఆనంద్‌బాబు (47) తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. కాగా అతని ప్రవర్తన పట్ల విసిగి వేశారిపోయిన కుటుంబ సభ్యులు భార్య, ఇరువురు కుమారులు కలిసి అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆనంద్‌బాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ సంఘటన పై ఆదివారం విఆర్‌వో బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఐ టి శ్రీరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద బాబు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.