క్రైమ్/లీగల్

లారీని ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఆగస్టు 5 : ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలోని జేపీ నగర్‌కు చెందిన కమలమ్మ(76), అనిల్‌కుమార్(50), ఆదిత్య(22) దుర్మరణం చెందారు. వివరాలు.. కమలమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయుర్వేద వైద్యం చేయించేందుకు కారులో బెంగళూరు నుంచి బళ్లారికి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో పెనుకొండ మండల పరిధిలోని గోనిపేట క్రాస్ వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
అనిల్‌కుమార్ బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. కమలమ్మ కుమారుడు అనిల్‌కుమార్ కాగా అతడి కుమారుడు ఆదిత్య. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.